Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్.. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చిస్తున్నట్టు సమాచారం. టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతున్న తరుణంలో చంద్రబాబుతో పవన్ భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.