Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్లు బదిలీ చూస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్గా అనంతరామును బదిలీ చేశారు. మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా ఎండీ ఇంతియాజ్ కు పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయ డైరెక్టర్గా లక్ష్మీషాకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే రెవెన్యూశాఖలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు ఒకే విభాగంగా ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు ఉన్నాయి. రెండు శాఖలకూ ఇప్పటివరకు ఒకే అధికారి ఉన్నారు. అయితే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ బాధ్యతలను తాజాగా సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ ప్రభుత్వం అప్పగించింది. ఇటీవల ఎనిమిది జిల్లాల కలెక్టర్లు సహా 56 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. శాంతి భద్రతల ఏడీజీ నుంచి ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ వరకూ స్ర్కూటినీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా 39మంది ఐపీఎస్ అధికారులకు బదిలీ, పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చింది.