Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బీసీ గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఎంట్రెన్స్ టెస్ట్ ఈ నెల 30న జరుగనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 277 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్యబట్టు తెలిపారు. ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని, పరీక్ష నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇంటర్ కోర్సుల ప్రవేశం కోసం 58,113 మంది విద్యార్థులు, డిగ్రీ కోర్సుల కోసం 8,429 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. హాల్ టికెట్లో ఉన్న పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగా చేరుకోవాలని ఆయన సూచించారు. 6, 7,,8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు 69,147 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. వచ్చే నెల 10న రాష్ట్రవ్యాప్తంగా 299 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామన్నారు. మే నెల 2 నుంచి హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని చెప్పారు.