Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ ఎంసెట్ హాల్టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. షెడ్యూల్ ప్రకారం వెబ్సైట్లో ఉన్నత విద్యామండలి వీటిని ఉంచింది. విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మే 10 నుంచి 15 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. మే 10, 11న అగ్రికల్చర్, మెడికల్.. 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 10నే గడువు ముగియగా.. మే 2 వరకు అపరాధ రుసుముతో అవకాశం ఉంది. ఎంసెట్కు ప్రతి 100 మందిలో ముగ్గురు ఆలస్య రుసుంతోనే దరఖాస్తు చేసుకున్నారు. రూ.250 నుంచి రూ.5 వేల వరకు అదనంగా చెల్లిస్తుండటం గమనార్హం. రూ.5 వేలతో ఇప్పటివరకు 59 మంది దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం వరకు మొత్తం 8,394 మంది ఆలస్య రుసుంతో పరీక్ష రాయడానికి ముందుకొచ్చారు. శుక్రవారానికి మొత్తం 3,19,947 మంది దరఖాస్తు చేసుకున్నారని ఎంసెట్ కోకన్వీనర్ ఆచార్య విజయకుమార్రెడ్డి తెలిపారు.