Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : విద్యా సంవత్సరంలో దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ సంస్థలు ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అభ్యర్థుల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆదివారం (ఏప్రిల్ 30) నుంచి విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే ఏడో తేదీ వరకు విద్యార్థులు తమ పేర్ల రిజిస్ట్రేషన్కు తుది గడువు. మే ఎనిమిదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు విద్యార్థులు ఫీజు పే చేయడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఇప్పటికే జేఈఈ-మెయిన్ 2023 రెండో సెషన్ ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. జేఈఈ-అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యే వారు వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. జేఈఈ-మెయిన్లో టాప్ 2.5 లక్షల ర్యాంకులు వచ్చిన విద్యార్థులు జేఈఈ-అడ్వాన్స్డ్ 2023 పరీక్ష రాసేందుకు అర్హులు. ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ కాన్ఫూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ గువాహటి, ఐఐటీ రూర్కే సంయుక్త ఆధ్వర్యంలో జేఈఈ అడ్వాన్స్డ్-2023 పరీక్ష ఉమ్మడిగా నిర్వహిస్తున్నారు. మహిళలు, ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగ విద్యార్థులు రూ.1450, ఇతర విద్యార్థులు రూ.2900 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.