Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. ఆదివారం ఉదయం పోలీసులకు వచ్చిన సమాచారంతో గుడిహత్నూర్ మండలంలోని సీతాగోంది శివారులో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. అవి ఆదిలాబాద్ పట్టణం భుక్తాపూర్కు చెందిన రెహమాన్(20), కేఆర్కే నగర్కు చెందిన అశ్విని(28)గా గుర్తించారు. అశ్వినికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసింది. కొన్ని నెలలుగా భర్తతో విడిపోయి పుట్టింట్లో ఉంటున్నట్లు సమాచారం. ఆమెకు రెహమాన్తో వివాహేతర సంబంధం ఉండడం వల్లే ఈ హత్యలు జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వీరిద్దరూ శుక్రవారం ఆదిలాబాద్ నుంచి సీతాగోందిలో స్థానిక పంట పొలంలోకి ద్విచక్రవాహనంపై వెళ్తున్న సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించారు. వారు మృతదేహాలను పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. వారిద్దరి తలలపై బండరాళ్లతో మోది కిరాతకంగా హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ హత్యలు అశ్విని భర్త తరఫు వాళ్లే చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. శవ పరీక్ష కోసం మృతదేహాలను రిమ్స్కు తరలించారు. ప్రాథమిక విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ నాగేందర్ తెలిపారు. ఘటన స్థలాన్ని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి సందర్శించారు.