Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: ఓ వ్యభిచార గృహంపై జీడిమెట్ల పోలీసలు దాడి చేసి ఇద్దరు నిర్వహకులతో పాటు ఓ మహిళ, ఓ యువకుడిని అరెస్టు చేశారు. సీఐ యం.పవన్ వివరాల ప్రకారం.. ఆదివారం గాజులరామారంలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కన్నెపల్లి శోభ(47), మందుల లత(35) అనే ఇద్దరు నిర్వాహకులతో పాటు ఓ మహిళ(23), గుండ్లపోచంపల్లికి చెందిన సందీప్ కుమార్ జేనా(27)లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అందరిని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. మహిళను రెస్క్యూ హోంకు తరలించారు.