#WATCH | Delhi: At around 11 pm last night, a car coming from Ashram Chowk to Nizamuddin Dargah drove for around 2-3 kilometres with a person hanging on the bonnet. pic.twitter.com/54dOCqxWTh
— ANI (@ANI) May 1, 2023
Authorization
#WATCH | Delhi: At around 11 pm last night, a car coming from Ashram Chowk to Nizamuddin Dargah drove for around 2-3 kilometres with a person hanging on the bonnet. pic.twitter.com/54dOCqxWTh
— ANI (@ANI) May 1, 2023
నవతెలంగాణ - ఢిల్లీ
ఢిల్లీలో ఇటీవల కారు ప్రమాద ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఓ వ్యక్తిని కారు బానెట్పై ఎక్కించుకుని దాదాపు మూడు కిలోమీటర్లు అలానే ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన ఢిల్లీలో గత రాత్రి 11 గంటల సమయంలో చోటు చేసుకుంది. చేతన్ అనే వ్యక్తి స్థానికంగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఓ ప్రయాణికుడిని ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో డ్రాప్ చేసి తిరిగి వెళ్తున్నాడు. స్థానికంగా ఉన్న ఆశ్రమ్చౌక్ వద్దకు రాగానే చేతన్ కారును రాంచంద్ కుమార్ అనే వ్యక్తి మద్యం మత్తులో మూడు సార్లు ఢీ కొట్టాడు. దీంతో చేతన్ కారు దిగి సదరు వ్యక్తిని ప్రశ్నించబోయాడు. అవేవీ పట్టించుకోని రాంచంద్ కారును వేగంగా తనపైకి పోనిచ్చినట్లు చేతన్ పేర్కొన్నాడు. దీంతో తాను కారు బానెట్పై ఉండిపోయినట్లు చెప్పాడు. అనంతరం అలాగే మూడు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడని.. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న పోలీసులు ఇదంతా గమనించి కారును వెంబడించినట్లు బాధితుడు తెలిపాడు. కారు ఆపమని ఎంత చెప్పినా వినలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా, ఈ ఘటనపై నిందితుడు రాంచంద్ కుమార్ మాట్లాడుతూ.. తాను అసలు చేతన్ కారును ఢీ కొట్టలేదని చెప్పాడు. అతను ఉద్దేశపూర్వకంగానే తన కారు బానెట్పైకి ఎక్కి తనను కారులోంచి దిగమని నానా హంగమా చేశాడని ఆరోపించాడు. కారు బానెట్ నుంచి దిగమని అతనికి తాను చాలాసార్లు చెప్పానని కాని అతను వినలేదని రాంచంద్ కుమార్ తెలిపాడు. ఘటనకు కారణమైన కారు బీహార్ ఎంపీ చందన్ సింగ్కు చెందినదని పోలీసులు గుర్తించారు. అయితే ఘటన సమయంలో ఎంపీ కారులో లేరని, ర్యాష్ డ్రైవింగ్ కింద రాంచంద్ కుమార్పై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. కాగా, ఘటనకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.