Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : జాతీయస్థాయిలో హవా చాటేందుకు భారత్ రాష్ట్ర సమితి పార్టీ సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఆ దిశగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కార్యకలాపాలు మరింత వేగంగా దూసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని వసంత్ విహార్లో నిర్మిస్తున్న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని (తెలంగాణ భవన్) ఈ నెల 4న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇవాళ సాయంత్రం లేదా బుధవారం ఉదయం ఢిల్లీకి ఆయన వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. నాలుగు అంతస్తులుగా భవనాన్ని నిర్మించారు. సోమవారం సాయంత్రమే మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ ఢిల్లీకి పయనమయ్యారు.