Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఈనెల 8న హైదరాబాద్ రానున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పీసీసీ నిర్వహిస్తున్న నిరుద్యోగ నిరసన సభలో ఆమె పాల్గొంటారని పార్టీ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. వాస్తవానికి ఈనెల 5 లేదా 6న సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతారని ఇదివరకే ప్రకటించారు. కానీ... సభ 8వ తేదీకి వాయిదా పడినట్లు తెలిసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈనెల 8తో ముగియనుంది. అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగివెళుతూ ఆమె హైదరాబాద్కు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.