Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
జీవో 58, 59 కింద హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని పేదల ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువును మరో నెల పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. నిబంధనల మేరకు పేదల ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించి, న్యాయపరమైన హకులను కల్పిస్తామని స్పష్టంచేశారు. సోమవారం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని ఎమ్మెల్యేలు సచివాలయంలో సీఎం కేసీఆర్ను కలిసి గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. నోటరీ, 58, 59 జీవోలకు సంబంధించిన సమస్యల పరిషారానికి సానుకూలంగా స్పందించారు. మరో నెల రోజుల గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు.
తక్షణమే తమ నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కలిసి నోటరీ తదితర ఇండ్ల స్థలాల రెగ్యులేషన్ సమస్యలను తెలుపుకోవాలని సూచించారు. అన్ని సమస్యలను క్రోడీకరించి, పరిషరించి, వారికి న్యాయపరమైన హకులతో కూడిన పట్టాలను ప్రభుత్వం అందజేస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. వ్యవసాయ భూముల నోటరీ సమస్యలను కూడా పరిషరిస్తామని భరోసా ఇచ్చారు.