Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిరిసిల్ల
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు పాడయిపోయిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ వాహన శ్రేణికి అడ్డంగా వెళ్లారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు.