Authorization
Mon March 03, 2025 06:20:34 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
దొంగలందరికీ మోడీ అనే ఇంటి పేరు ఉంటోందంటూ వ్యాఖ్యలు చేసి రెండేళ్ల జైలుశిక్షకు గురైన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ కేసు నుంచి బయటపడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ పరువునష్టం దావా వేయగా, సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించినా ఊరట లభించడంలేదు.
తాజాగా ఈ కేసులో రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. రాహుల్ పిటిషన్ పై వేసవి సెలవులు ముగిసిన తర్వాత ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. రాహుల్ పిటిషన్ పై జూన్ 4 తర్వాత తీర్పు ఉంటుందని వెల్లడించింది. జైలు శిక్ష నిలిపివేయాలన్న మధ్యంతర పిటిషన్ ను గుజరాత్ హైకోర్టు కొట్టివేసింది.