Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతలెంగాణ-హైదరాబాద్ : వరుసగా ఎనిమిది రోజుల పాటు లాభాల జోరును కొనసాగించిన స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు నిరాశాజనకంగా ఉండటం... కీలక వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఈక్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 161 పాయింట్లు నష్టపోయి 61,193కి పడిపోయింది. నిఫ్టీ 58 పాయింట్లు కోల్పోయి 18,089 వద్ద స్థిరపడింది.