Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సెర్బియాలోని బెల్గ్రేడ్లోగల ఒక పాఠశాలలో బుధవారం ఒక 14 ఏళ్ల బాలుడు జరిపిన కాల్పులలో 8 మంది విద్యార్థులు, సెక్యూరిటీ గార్డు మరణించారు. మరో ఆరుగురు పిల్లలు, ఒక టీచర్ కూడా కాల్పులలో గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన బాలుడిని కెకె అనే పొడి అక్షరాలతో పేపోలీసులు గుర్తించారు. అతను ఆ స్కూలు పూర్వ విద్యార్థని పోలీసులు చెప్పారు. 2009లో జన్మించిన ఆ బాలుడిని స్కూలు ఆవరణలో అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.