Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నీరా కేఫ్ను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ప్రకృతి సిద్ధమైన, స్వచ్ఛమైన నీరాను రాష్ట్ర ప్రజలకు అందించనున్నారు. గీత వృత్తిదారులకు రైతు బీమా తరహాలో గీత కార్మికుల బీమాను ప్రకటించిన సీఎం కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు ానీరాభిషేకం్ణ చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గీత వృత్తి ప్రోత్సాహానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రైతు బీమా మాదిరిగా గీత కార్మికుల కోసం రూ. 5 లక్షల బీమాను కల్పించినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 50 ఏండ్ల వయస్సు పైబడిన, అర్హులైన దాదాపు లక్ష మంది గీత కార్మికులకు ప్రతి నెల రూ. 2016 ల పెన్షన్లు అందిస్తున్నామన్నారు. మద్యం దుకాణం కేటాయింపుల్లో గౌడ సామాజిక వర్గానికి 15 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించడం సాహోసోపేతమైన నిర్ణయం అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.