Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ నియామకం విషయంలో మళ్లీ గందరగోళం నెలకొంది. ఇటీవల పాలకమండలి సమావేశంలో ఇన్ఛార్జి రిజిస్ట్రార్ విద్యావర్ధినిని తప్పించి.. ఆచార్య యాదగిరిని నియమించారు. దీనిని వ్యతిరేకించిన ఉపకులపతి ఆచార్య రవీందర్ హైకోర్టును ఆశ్రయించడంతో నాటి పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను నిలిపేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉపకులపతి ఉస్మానియా వర్సిటీలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం అధిపతిగా ఉన్న నిర్మలాదేవిని రిజిస్ట్రార్గా నియమించారు. ఏడాది పదవీకాలానికి ఆర్డరు ఇవ్వడంతో ఆమె బుధవారం మధ్యాహ్నం విధుల్లో చేరారు. అయితే కాసేపటి తర్వాత నిర్మలాదేవి రిలీవ్ ఉత్తర్వులను ఉస్మానియా వర్సిటీ రద్దు చేయడం చర్చనీయాంశమైంది.