Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: జూన్ 20న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎల్లమ్మ తల్లికి బంగారు కిరీటం సమర్పించనున్నామని తెలిపారు. ఆలయ ప్రధాన ద్వారాలకు వెండి తాపడం చేయిస్తామన్నారు. హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద దాతల సహకారంతో నిర్మించిన 34 షాపులను మంత్రి తలసాని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని చెప్పారు. చిరు వ్యాపారులకు షాపులను ఉచితంగా కేటాయించామని వెల్లడించారు. భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్న బంగారంతో అమ్మవారికి ఆభరణాలు చేయిస్తున్నామని తెలిపారు. ఇలా 2.20 కిలోల బంగారంతో కిరీటం, ఇతర ఆభరణాలు తయారయ్యాయని మంత్రి తలసాని చెప్పారు.