Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్ పూర్ టికెట్ అంశంపై ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. టికెట్ పై ఎన్నికల ముందు ఎన్ని రూమర్లు వచ్చినా గాబరా పడద్దని అన్నారు. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ తరఫున టికెట్ తనకేనని.. గెలుపు కూడా తనదేనని ధీమా వ్యక్తం చేశారు. తాను సీఎం కేసీఆర్ కు వీర విధేయుడినన్నారు రాజయ్య. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని వెల్లడించారు. రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉంటాయని తెలిపారు. ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీని విడిచి బీఆర్ఎస్ లోకి వచ్చానని.. వచ్చే ఎన్నికలలో కేసీఆర్ ఆశీర్వాదంతో బంపర్ మెజారిటీతో గెలుస్తానని అన్నారు. తనతో కలిసి రాజీనామా చేసిన వారు ఎవరు కూడా ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో లేరని అన్నారు.