Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలో గురువారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి ముగ్గురు మృతిచెందారు. ప్రమాదవశాత్తు చెరువులో పడినట్లు అధికారులు గుర్తించారు. మృతులను హైదరాబాద్ కు చెందిన కాశీ(30), సోహెల్(17), ముస్తఫా(3)గా గుర్తించారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామర్లపల్లిలో ఈ సంఘటన జరిగింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.