Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ 16వ సీజన్లో హైదరాబాద్ వేదికగా 47వ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్, కేకేఆర్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ నిర్ణిత 20ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. దీంతో ఎస్ ఆర్ హెచ్ కు 172 పరుగులు లక్ష్యాన్ని నిర్ధేశించింది. కోల్ కతా బ్యాట్స్ మెన్లలో కెఫ్టెన్ నితిష్ రాణా (42) పరుగులు చేయగా రింకు సింగ్ (46) పరగులు చేశాడు. రస్సేల్ (24) రాయ్ (20) పరగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో మార్క ఎన్ సన్ రెండు, నటరాజన్ రెండు వికెట్లు తీయగా భువనేశ్వర్, కార్తిక్ త్యాగి, మార్కరామ్ మయంక్ మార్కెండే తలో వికెట్ తీశారు.