Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై : భవిష్యత్ రాజకీయాలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, శివసేన పొత్తు నేపథ్యంలో తాను పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతానని శరద్ పవార్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తాను పార్లమెంటుకు పోటీ చేస్తానని, తన మేనల్లుడు అజిత్ పవార్ కాని ఇతర కుటుంబసభ్యులెవరూ పోటీ చేయరని శరద్ పవార్ స్పష్టం చేశారు. పవార్ మనవడు రోహిత్ పవార్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని పుకార్లు వ్యాపించిన నేపథ్యంలో శరద్ పవార్ ఈ ప్రకటన చేశారు. బీజేపీ, శివసేన పొత్తు గురించి శరద్ పవార్ మాట్లాడుతూ, మొన్నటి దాకా ఆ రెండు పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నాయని, కానీ నేడు కలిశాయని దీనిపై ప్రజలే నిర్ణయం తీసుకుంటారని పవార్ వ్యాఖ్యానించారు.