Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం మధ్యాహ్నం కైకలూరులో ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు. ఈ సభలో పాల్గొని పవన్ మాట్లాడారు. తనకు భయం లేదని..మార్పు కోసమే తన పోరాటమని పవన్ తెలిపారు. పాతకోటలను బద్దలు కొట్టి కొత్త రాజకీయాలు తెస్తానన్నారు. విజయసాయి రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని మండిపడ్డారు. పులివెందుల రాజకీయాలు ఇక్కడ సాగవని, తనకు భయం లేదని..మార్పు కోసమే నా పోరాటమని స్పష్టం చేశారు. కెసిఆర్ లిస్ట్ తయారు చేస్తే...జగన్ బిఫాంలిచ్చారని వ్యాఖ్యానించారు.