Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సీబీఎస్ఈ పాఠ్యాంశాల్లో కృత్రిమ మేథ, యోగా, బాల్య సంరక్షణ విద్య కూడా భాగం కానున్నాయి. ఈ మూడు సబ్జెక్టులను సీబీఎస్ఈలో కొత్తగా చేర్చనున్నట్లు అధికారులు వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠ్యాంశాలు కూడా మారాలని అందుకే ఈ సబ్జెక్టులను ప్రవేశపెడుతున్నట్లు వారు చెప్పారు. తాజాగా జరిగిన సీబీఎస్ఈ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2019-20 విద్యా సంవత్సరం నుంచి తొమ్మిదో తరగతిలో ఆప్షనల్ సబ్జెక్టుగా కృత్రిమ మేథను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.