Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భాగ్యనగరంలోని ఎల్బీనగర్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎల్బీనగర్లోని సాగర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న కస్తూరి కాలనీలోని జీసెస్ గ్రోత్ స్క్రాబ్ ట్రేడింగ్ కంపనీ గోడౌన్లో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానిక సమాచారం మేరకు రెండు ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈ ప్రమాదం ఎలా జరిగింది..? ఏ మేరకు నష్టం వాటిల్లింది..? అనే విషయం తెలియాల్సి ఉంది.