Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ఏపీకి నూతన గవర్నర్ గా బిశ్వ భూషణ్ హరిచందన్ ను నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలోని పాత సీఎం క్యాంపు కార్యాలయాన్ని ఆయనకు కేటాయించారు. ఆ కార్యాలయాన్ని రాజ్ భవన్ గా మార్పుగా చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా, ఈ నెల 24న గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉండగా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న ముఖేశ్ మీనాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీ గవర్నర్ కార్యదర్శిగా ఆయన్ని నియమించారు.