Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధించే బాధ్యత జగన్ పైనే ఉందని టీడీపీ ఎంపీ కేశినేని నాని సూచించారు. పార్లమెంట్లో ఫైనాన్స్ బిల్లు చర్చలో కేశినేని నాని పాల్గొని మాట్లాడారు. జగన్ పాదయాత్రలో ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారని గుర్తుచేశారు. జగన్ ఇచ్చిన హామీ మేరకు వైసీపీ 22మంది ఎంపీలు పార్లమెంట్లో పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేంద్ర బడ్జెట్ ఏపీ ప్రజల ఆశలపై నీళ్లు జల్లిందన్నారు. ఏపీకి కేవలం 21 కోట్లే కేటాయించి ప్రజలను అవమానిచ్చిందని ఆరోపించారు. అమరావతి, పోలవరం నిర్మాణం, విజయవాడ, విశాఖ మెట్రో, విద్యాసంస్థలకు బడ్జెట్లో నిధులు లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.