Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆసిఫాబాద్ జిల్లా: యువకుడిపై పిడుగుపడిన ఘటన బెజ్జూర్ మండలంలోని మర్తిడి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొల్లపల్లి రాజేశ్వర్ పై పిడుగు పడటంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు బెజ్జుర్ ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కాగజ్ నగర్ కు తరలించారు.