Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫరూఖాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ గర్భిణీ మహిళ ఆస్పత్రి హాల్లోనే ప్రసవించింది. ఆ మహిళా పురిటీ నొప్పులతో బాధపడుతున్నా సాయం చేసేందుకు ఆ సమయంలో డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది, నర్సులు లేరు, కానీ అతి కష్టం మీద గర్భిణీ మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అందరూ చూస్తుండగానే మహిళ ప్రసవించింది. ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించిన డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనను ఓ మొబైల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఆస్పత్రిలో బెడ్స్ లేవని బాధితురాలి బంధువులు చెబుతుండగా.. అయితే ఇది ఇలా ఉండగా గర్భిణీ మహిళ లేబర్ రూం నుంచి టాయిలెట్కు వెళ్లి వస్తుండగా హాల్లో ప్రసవించిందని సిబ్బంది చెబుతున్నారు.