Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండర్లు వేయాలన్న ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని హైకోర్టు తప్పబట్టిన విషయం తెలిసిందే. రివర్స్ టెండర్లపై హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరి ఈరోజు కలిశారు. పోలవరం ప్రాజెక్టుపై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ ప్రాజెక్టు భవిష్యత్తుపై ఏపీ ప్రజల్లో గందరగోళం నెలకొందని, హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రాజెక్టుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని సుజనా కోరినట్టు సమాచారం.