Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మ్యాన్ హోల్ లో ఏడాదిన్నర చిన్నారి పడి గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటనలో మెహిదిపట్నం సెక్షన్ మేనేజర్ డి.చంద్రును జలమండలి ఎండీ దానకిషోర్ సస్పెండ్ చేశారు. అలాగే చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.25వేలు తక్షణ సాయాన్ని ప్రకటించారు. గుడి మల్కాపూర్ డివిజన్ మహావీర్ యాదవ నగర్ లో బుధవారం రోజున తెరిచి ఉన్న జలమండలి మ్యాన్ హోల్ లో పడి ఏడాదిన్నర చిన్నారి దీక్షిత్ గాయపడడం జరిగింది. దీనిపై విచారణ జరిపించిన జలమండలి ఎండీ ఎం. దానకిషోర్ సంబంధిత సెక్షన్ మేనేజర్ ను సస్పెండ్ చేశారు. అలాగే గుత్తేదారు మ్యాన్ హోల్ మరమ్మత్తు పనులను పూర్తిచేయడంలో ఆలస్యం చేసినందుకు గాను, అలాగే పనులు జరుగుతున్నప్పుడు బారికేడ్లు పెట్టకపోవడం, జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం వల్ల ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. కాబట్టి సంబంధిత ఏజెన్సీ మెస్సర్ కీర్తి ఎంటర్ ప్రైజెస్ ను బ్లాక్ లిస్టులో పెట్టిౌ క్రిమినల్ కేసు నమోదు చేయాలని సంబంధిత డివిజన్3 జనరల్ మేనేజర్ ను ఆదేశించారు. మ్యాన్ హోల్ లకు మరమ్మత్తు చేయించకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఎండీ సంబంధిత అధికారి, గుత్తుపై చర్యలు తీసుకున్నారు. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి దిక్షిత్ కు మెరుగైన వైద్యం అందించేందుకు గాను రూ. 25వేలు తక్షణ సాయం కింద అందించనున్నట్లు జలమండలి ఎండీ తెలిపారు.