Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం హిక్కా తుపానుగా మారి ఒమన్ దేశ తీరాన్ని తాకనుందని ఢిల్లీలోని భారత వాతావరణ కేంద్రం సోమవారం ఉదయం వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం ఒమన్ దేశంలోని మసిరాహ్ కు 760 కిలోమీటర్ల దూరంలో ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఈ నెల 25వతేదీ నాటికి ఈ వాయుగుండం ఒమన్ తీరాన్ని తాకుతుందని అధికారులు హెచ్చరించారు. హిక్కా తుపాన్ ప్రభావం వల్ల గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర, కచ్ తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని అధికారులు హెచ్చరించారు. తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 25వతేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.