Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కంచికచర్ల: టోల్గేట్ సిబ్బంది ప్రవర్తనపై వాహనచోదకులు నిరసన తెలిపారు. 65వ జాతీయ రహదారిపై కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర వద్ద టోల్గేట్ సిబ్బంది వాహనచోదకుల పట్ల దురుసుగా మాట్లాడటంతో వాహన చోదకుడు తన కారును అడ్డంగా పెట్టి నిరసన వ్యక్తం చేశాడు. టోల్గేట్ నిర్వాహకులు వాహనచోదకులకు సూచనలు ఇవ్వకపోవడంతో, టోల్ ఫీజు చెల్లించే విషయంలో దురుసుగా మాట్లాడటంతో వాహన చోదకుడు కారు అడ్డంపెట్టి నిరసన తెలిపాడు. అనంతరం టోల్గేట్ సిబ్బంది అతనిపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. టోల్ సిబ్బంది వాహన చోదకుల పట్ల దురుసుగా మాట్లాడకుండా జాతీయ రహదారులశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని వాహన యజమానులు డిమాండ్ చేస్తున్నారు.