Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని చాందూరిలో ఈతకు వెళ్లిన యువకుడు చెరువులో మునిగి మృతిచెందాడు. చాందూరికి చెందిన మరప జంగు (18) రాజులగూడ చెరువులో స్నానాని కి వెళ్లి చెరువులో మునిగి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. చాందూరికి చెం దిన మరప దత్త, అంబుబాయిలకు ఇద్దరు కుమారులు. పెద్దవాడైన జంగు గుడిహత్నూర్ సమీపంలో ఉన్న లక్ష్మి దాబాలో పనిచేస్తున్నాడు. శివరాత్రి పండుగకు ఇంటికి వచ్చిన జంగు స్నానానికి వెళ్లి మృత్యువాతకు గురయ్యాడని గ్రామస్థులు తెలిపారు. ఎస్సై సుబ్బారావు ఘటన స్థలాన్ని సందర్శించి శవాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.