Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవిష్కరించిన మంత్రి నిరంజన్రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ పరిశోధనా సంస్థ ఇక్రిసాట్ నూతనంగా అభివద్ధి చేసిన వేరుశనగ వంగడాలను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం మినిస్టర్క్వార్టర్స్లోని తన నివాసంలో నూతన వేరుశనగ వంగడాలకు సంబంధించిన వివరాలను మంత్రి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈరకం వంగడాలపై ఆసక్తి చూపిస్తున్న ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఆహార సంస్థలైన మార్స్, మాండెలిజ్ ఈ ఉత్పత్తులు సేకరించే విధంగా ఒప్పందానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్రిసాట్, ఐసీఎఆర్ (భారత జాతీయ వ్యవసాయ పరిశోధనామండలి) సహకారంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ వండగడాలు ఉత్పత్తి చేసినట్టు తెలిపారు. 80శాతం ఓలిక్యాసిడ్ ఉండే గిరినార్ 4, గిరినార్ 5 వంగడాలను మంత్రి ఆవిష్కరించారు. రాబోయే యాసంగికి అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వివరించారు.