Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రం నుంచే కరోనా వైరస్కు తొలి టీకా వస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఉన్న భారత్బయోటెక్ సంస్థ నుంచే ఆ టీకా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. నగరంలోని జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సంస్థ ఉద్యోగులతో మాట్లాడారు. వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉండడం రాష్ట్రానికే గర్వకారణమని అభినందించారు. అనంతరం మంత్రి బయోటెక్ సీఎండీ డాక్టర్ కష్ణా ఎల్లా, తెలంగాణ లైఫ్ సైన్సెస్, ఫార్మా డైరక్టర్ శక్తి నాగప్పన్తో కలిసి చర్చించారు. వ్యాక్సిన్ అవసరాల దష్ట్యా హైదరాబాద్ ప్రాముఖ్యత పెరిగిందన్నారు.