Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రవాణామంత్రికి టీఎస్ఆర్టీసీ ఎస్డబ్ల్యుఎఫ్ లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కరోనా భయంతో ఆర్టీసీ కార్మికులు మానసికంగా కుంగుబాటుకు గురవుతుంటే, ఆర్టీసీ యాజమాన్యం వారికి అండగా ఉన్నామనే భరోసాను ఎందుకు కల్పించట్లేదని టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యుఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ రాంచందర్, వీఎస్ రావు ప్రశ్నించారు. ఈ మేరకు వారు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్కు మరోసారి లేఖ రాసారు. ఆర్టీసీ కార్మికులను కాపాడుకోవడం యాజమాన్య బాధ్యత అని చెప్పారు. కరోనా వైద్యంపై మేనేజింగ్ డైరెక్టర్కు, రవాణామంత్రికి వేర్వేరుగా రెండు లేఖలు రాసామనీ, అయినా స్పందన లేదని పేర్కొన్నారు. కరోనా సోకి ఆర్టీసీ కార్మికులు అనేకమంది మరణించారనీ, పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ వచ్చినవారు సరైన చికిత్స అందక మానసికంగా కుంగిపోతున్నారనీ తెలిపారు. లక్షణాలు ఉన్నా...పరీక్షలు చేయించుకోవడం గగనంగా మారిందని చెప్పారు. కార్మికుల సంఖ్యలో ఆర్టీసీ, సింగరేణి దాదాపు సమానమనీ, కానీ సింగరేణి యాజమాన్యం తమ ఉద్యోగులకు అండగా ఉన్నామంటూ ఆరోగ్య భరోసా కల్పిస్తూ, నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నదని వివరించారు. ఆ తరహాలో ఆర్టీసీ యాజమాన్యం స్పందించకపోవడాన్ని వారు తప్పుపట్టారు.
ఆర్టీసీ యాజమాన్యం ఈ క్రింది చర్యలు తీసుకొనేలా రవాణాశాఖ మంత్రి ఉత్తర్వులు ఇప్పించాలని కోరారు. తార్నాక ఆస్పత్రిలో వంద పడకలతో కరోనా ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి, యంత్రాలు, సిబ్బందిని సమకూర్చాలి. 2. టీఎస్ఆర్టీసీలోని అన్ని డిస్పెన్సరీలను కోవిడ్ పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ప్రకటించిన పద్ధతిలో కండక్టర్, డ్రైవర్లు మరణిస్తే రూ.50 లక్షల బీమా వర్తింప చేయాలి. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి 14 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆస్పత్రుల్లో వైద్యం అందించాలి. 7. అవసరమున్న మేరకే సిబ్బందిని రోటేషన్ పద్ధతిలో డిపోలకు పిలవాలి. డ్యూటీ లేనివారికి మస్టర్ ఇవ్వాలి. 8. కార్మికులకు వ్యక్తిగత రక్షణ పరికరాలు అందించాలి. 9. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం భౌతికదూరం పాటించేలా బస్సుల్ని నడిపించాలి. 10. డిపోల్లో క్యాష్ తీసుకొనే చోట, ఆయిల్ బంక్ వద్ద రక్షణ ఏర్పాట్లు చేయాలి.