Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజలు క్షమించరాని చారిత్రాత్మక తప్పులు చేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. మంగళవారం తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కష్ణా నీళ్లను రాయలసీమకు తరలిస్తామంటే కేసీఆర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గట్టిగా మాట్లాడితే అపెక్స్ కౌన్సిల్కు ఫిర్యాదు చేస్తామన్నారనీ, తీరా అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెడితే వాయిదా వేయమన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. 10 లక్షల ఎకరాలకు నీరు అందించే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. కేసీఆర్కు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యమా ? అని ప్రశ్నించారు.