Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశంలో దళితులు, మైనార్టీలను, రాజ్యాంగాన్ని అవమానపరిస్తే హిందువులు సంతోషిస్తారా? గర్వపడుతారా? అని బీజేపీ ప్రభుత్వాన్ని టీపీసీసీ అధికార ప్రతినిధి కృష్ణతేజ ప్రశ్నించారు. గోవుల పరిరక్షణ పేరుతో అక్రమంగా ఇతర దేశాలకు తరలిస్తూ...దేశ ద్రోహనికి పాల్పడుతూ నీతులు చెబుతారా? అని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఆలయాల నిర్మాణంపై పెట్టిన శ్రద్ధ పాఠశాలలు, ఆస్పత్రుల నిర్మాణంలో ఎందుకు పెట్టడంలేదని ప్రశ్నించారు.
మరోవైపు బీజేపీ ప్రభుత్వం ద్రవ్యోల్భణం అర్థాన్ని మార్చేసి, ప్రజలను తప్పుడు ప్రపంచంలో బతకమంటుందని విమర్శించారు. మేకిన్ ఇండియా, స్మార్ట్సిటీ మిషన్ తదితర పేర్లతో దేశ ప్రజలను ఆశల పల్లకీలో విహరింప చేస్తున్నదని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులు, మైనార్టీలు, అంబేద్కర్ ఆలోచనావిధానంపై తీవ్రమైన దాడికి పాల్పడుతుందని తెలిపారు. మతాల మధ్య చిచ్చు పెడుతూ బీజేపీ పబ్బం గడుపుకుంటుందని విమర్శించారు.