Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తీవ్ర అనారోగ్యంతో ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందు తున్న రిటైర్డ్ అధ్యాపకులు, విప్లవ రచయిత వరవర రావును వెంటనే బెయిల్పై విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ఇదే విషయంపై రాష్ట్రపతికి, ప్రధాన న్యాయమూర్తికి, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలను బుధవారం పంపింది. ఆ లేఖలపై ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ నాయ కులు కె. లక్ష్మయ్య, టి. శుభాకరరావు, జి.సదానందం గౌడ్, పి. పర్వతరెడ్డి, కె.జంగయ్య, చావ రవి, సిహెచ్ సంపత్ కుమారస్వామి, జి బాలస్వామి, కె రమణ, మైస శ్రీనివా సులు, ఎం రఘుశంకర్ రెడ్డి, టి లింగారెడ్డి, కె కృష్ణుడు, లక్ష్మణ్ గౌడ్, ఎం రాధాకృష్ణ, చంద్రశేఖర్, తాజ్ మోహ న్రెడ్డి, యు పోచయ్య, డి సైదులు, జి ఉపేందర్, జె వెంక టేష్, ఆర్ కృష్ణారెడ్డి, భూపాల్, కె యాదానాయక్, పి భాస్కర్, షౌకత్ అలీ, ఎన్ చెన్నరాములు, ఎస్ మధు సూదన్ రావు, కె మహిపాల్ రెడ్డి, ఇ లక్ష్మణ్ నాయక్, జె రాజన్న, వెంకట్రావు జాదవ్, కొమ్ము రమేశ్, సిహెచ్ యాదగిరి, శాగ కైలాసం, సిహెచ్ రమేష్, ఎ గంగాధర్, డివి రావు, ఎం రాములు, ఆర్ ఈశ్వర్, ఎం రంగయ్య, పి కృష్ణమూర్తి, వెంకట్ రెడ్డి, కె జయబాబు, కె రామారావు, ఎం రామారావు, బి కొండయ్య, ఎస్ విఠల్, ఎమ్డీ ఖమ్రొద్దీన్, మల్లీశ్వరి, ఎస్ హరికష్ణ, ఎం శ్రీను నాయక్, మసూద్ అహ్మద్, కె వెంకట్, చంద్రశేఖర్, భిక్షపతి, విజయకుమార్ తదితరులు సంతకాలు చేశారు.