Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్
బీపీఆర్ ఆచార్య పిలుపు
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
సమాజంలో నిజమైన మార్పులకు ఐపీఎస్ అధికారులు కృషి చేయాలని రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ,డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆరడీ డైరెక్టర్ జనరల్ బీపీఆర్ ఆచార్య పిలుపు నిచ్చారు. బుధవారం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ లో ప్రొబీషనరీ ఐపీఎస్ అధికారులకు భూ సంబంధిత చట్టాలు, రికార్డులు, పరిష్కారాలు అనే అంశంపై జరిగిన అవగాహన సదస్సులో ఆచార్య మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో నేరాల రూపు రేఖలను విశ్లేషించి వాటిపై అవగాహన పెంచుకుని పరిష్కారాలకు యువ ఐపీఎస్లు చ్తిశుద్దితో పాటుపడాలని పేర్కొన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తమ ప్రజ్ఞను ఉపయోగించాలని ఆయన సూచించారు. మారుతున్న కలానాకి అనుగుణంగా సమాజాన్ని బహుముఖ రీతిలో అభివృద్ది పరచిఏ దిశగా ఐపీఎస్ల అడుగులు సాగాలని ఆచార్య కోరారు. గతంలో అనేక మంది నీజి,నిజాయితీ, నిర్మీతితో పనిచేసన ఐపీఎస్ అధికారుల పని తీరును యువ ఐపీఎస్లు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు. ఐపీఎస్ అధికారులుగా మీకున్న అఇకారాలను సజావుగా వాడుకొని సమాజం మీపై పెట్టుకున్న ఆశలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్క యువ ఐపీఎస్ అధికారి కృషి చేయాలని ఆయన అభిలాషను వ్యక్తం పరిచారు. పాలనాపరంగా ఎదురయ్యే అనేక సమస్యలను సమాజహితంలో భాగంగా పరిష్కరించడానికి తగిన అనుభవాన్ని సముపార్జించాలని తద్వారా ది బెస్ట్ ఐపీఎస్ అధికారులు తమకు , దేశానికి పేరు గడించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ అవగాహన కార్యక్రమానికి 2019 బ్యాచ్కు చెందిన ఐదుగురు ప్రొబీషనరీ ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. వీరికి వివిధ అంశాలపై రిటైర్డు ఐఏఎస్ అధికారి ఏకె గోయల్, ఎంసీఆర్ హెచ్ఆర్డి అదనపు డీజీ హర్ప్రీత్సింగ్, రిటైర్డు ఐఏఎస్ అధికారి డాక్టర్ మహ్మద్అలీ రఫత్, రిటైర్డు ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ పీ కె శర్మ, తదితరులు శిశ్రీక్షకులుగా వ్యవహరించారు. ఈ సంధర్భంగా తెలంగాణకు సంబంధించిన పుస్తకాలను యువ ఐపీస్లకు బీపీ ఆచార్య అందచేశారు. అలాగే సివిల్స్ అత్యుత్తమంగా నిలిచి తెలంగాణ నుంచి సివిల్స్ టాపర్గా నిలిచిన పెద్దింటి ధర్తిరెడ్డిని యన అభినందించారు.