Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
పెట్టుబడులకు అధిక లాభాలను ఇస్తానంటు వేల కోట్ల రూపాjలు డిపాజిటర్లకు కుచ్చుటోపి తొడిగిన కిలాడి నౌఏరాషేక్ భూములను ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జప్తు చేశారు. టోలీచౌకి షేక్పేట్లలోని దాదాపు 33 వేల గజాలకు పైగా గజాల విలువైన భూమిని ఈడీ సీజ్ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తన వ్యాపారాలలో పెట్టుబడులు పెడితే అందుకు భారీ మొత్తంలో లాభాలను ఇస్తానంటు నౌఏరాషేక్ వేల కోట్ల రూపాయలను సేకరించి డిపాజిటర్లకు కుచ్చుటోపి తొడిగినట్టు దర్యాప్తులో తేలిన విషయం తెలిసిందే.
ఆమె చేసిన మోసాలపై వచ్చిన ఫిర్యాదులపై కేసులను నమోదు చేసుకుని ఒక పక్క నగర నేర పరిశోధక శాఖ దర్యాప్తును సాగిస్తున్నది. మరో వైపు షేక్కు సౌదీతో పాటు మరికొన్ని గల్ఫ్ దేశాల్లోను వ్యాపారాలు, ఆస్తులు ఉన్నట్టు అందిన సమాచారంపై ఈడీ కూడా రంగంలోకి దిగి దర్యాప్తును సాగిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆమె అక్రమాస్తులు ఎక్కడెక్కడ ఉన్నది దర్యాప్తులో తేల్చి వాటిని జప్తు చేయడానికి రంగంలోకి దిగినట్టు అధకార వర్గాలను బట్టి తెలిసింది. ఈ మేరకు నగరంలోని షేక్పేట్, టోలీచౌకిలోని 33వేలకు పగా గజాల భూమిని గుర్తించి సీజ్ చేసింది. ఇందులో కొంత భాగాన్ని ఇప్పటికే నగర సీసీఎస్ అధికారులు సీజ్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఆమెకు చెందిన మరి కొన్ని నివాస భవనాల గురించి కూడా ఈడీ ఆరా తీస్తున్నది. ఈ విషయంలో సీసీఎస్ వ్ద ఉన్న సమాచారాన్ని కూడా తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఈడీ జప్తు చేసిన భూమి విలువ దాదాపు వందకోట్ల రూపాయలకు పైనే ఉంటుందని తెలుస్తోంది.