Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులతో ఏర్పడిన విలేజ్ లెర్నింగ్ సర్కిళ్లకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యాన 50 కంప్యూటర్లు, 500 కుర్చీలను శనివారం బహుకరించారు. సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులకు అవసరమైన ట్యాబులు, కంప్యూటర్లు కొనలేని పేద విద్యార్థుల కోసం ఈ సాయం చేసినట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో తెలిపారు. భవిష్యత్తులోనూ పేద విద్యార్థుల చదువు కోసం తమకు చేతనైనంత సహాయం అందిస్తామని వివరించారు.