Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చింతలపాలెం
అక్రమ మద్యం సరఫరాకు సహకరించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్ సోమవారం సస్పెండ్ చేశారు. చింతలపాలెం ఎస్ఐ నవీన్కుమార్ వివరాల ప్రకారం.. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ సమ యంలో చింతలపాలెం నుంచి ఆంధ్రప్రదేశ్కు కొంత మంది అక్రమంగా మద్యం సరఫరా చేశారు. వారికి సూర్యాపేట జిల్లా చింతలపాలెం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న జానకి రాములు, సతీష్ సహకరించారు. విచారణ నిర్వహించిన పై అధికారులు అక్రమ మద్యానికి కానిస్టేబుళ్లు సహకరించినట్టు తేల్చారు. ఈ మేరకు వారిద్దర్నీ సస్పెండ్ చేస్తున్నట్టు ఎస్పీ భాస్కరన్ ఉత్తర్వులు జారీ చేశారు.