Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పర్యావరణ హిత బ్యాటరీతో నడిచే విజయపాల ఉత్పత్తుల వాహనాల ద్వారా నిరుద్యోగ యువత ఉపాధి పొందవచ్చని విజయ డెయిరీ చైర్మెన్ లోకాభూమారెడ్డి పేర్కొన్నారు. సోమవారం విజయడెయిరీ ఆవరణలో బ్యాటరీతో నడిచే పది వాహ నాలను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్రావు మాట్లాడుతూ నిరు ద్యోగులకు ఉపాధి, వినియోగ దారులకు ఆరోగ్యం చేకూర్చే విజయ ఉత్ప త్తులు ప్రజలు ఆదరించాలని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ , లాభాపేక్ష లేకుం డా విజయ డెయిరీ నమ్మ కానికి ప్రతీకగా నిలిచిం దన్నా రు. ఈ కార్యక్రమంలో డెయిరీ ఉన్న తాది óకారులు, మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.