Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర అటవీ, పర్యావరణ శాఖమంత్రికి 'పట్నం' లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈఐఏ-2020 డ్రాప్టును ఉపసంహరి ంచుకోవాలని పట్నం(తెలంగాణ అర్బన్ ఏరియా డెవలప్మెంట్ ఫోరమ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వేణుగోపాల్రావు, డీజీ నర్సింహారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ, వాతా వ రణ శాఖ మంత్రి ప్రకాశ్జవదేకర్కు వారు సోమవారం లేఖ రాశారు. ఈ ముసాయిదా లోని నిబంధనలు పర్యావరణ పరిరక్షణ చట్టం-1986కు తూట్లు పొడిచేలా ఉన్నా యని పేర్కొన్నారు. ఈ ముసాయిదా పర్యా వరణ పరిరక్షణలో ప్రజల భాగస్వా మ్యాన్ని తగ్గించేలా ఉందన్నారు. కంపెనీలు, పరిశ్ర మలకు సులువుగా పర్యా వరణ అను మతు లు లభించే వెసులుబాటు ఉందనీ, దీని వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతిం టుం దని వాపోయారు. ఇప్పటికే ఈఐఏ నిబం ధనల కు విరుద్ధంగా పర్యావరణాన్ని దెబ్బతీసే అనే క కంపెనీలు పనిచేస్తున్నాయని చెబుతూ విశాఖలో గ్యాస్ పాలిమర్స్ పరిశ్రమలను ఉదహరించారు.