Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1256 మందికి పాజిటివ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రతి రోజూ చేస్తున్నకరోనా టెస్టుల మరోసారి 50 శాతం తగ్గించారు. ఒకవైపు ప్రతి రోజూ 40 వేల టెస్టులు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం అలా పెంచకపోగా సాధారణ రోజుల్లో చేసే టెస్టుల సంఖ్యను సెలవు రోజుల్లో సగానికి తగ్గిస్తున్నది. సెలవు రోజుల్లో నమూనాల సేకరణ, పరీక్షలను తక్కువగా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. సాధారణ రోజుల్లో 20 వేలకు పైగా టెస్టులు చేస్తుండగా శనివారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు 24 గంటల్లో కేవలం 11,609 మందిని మాత్రమే పరీక్షించారు. వీరిలోనూ 1700 మందికి ఇంకా రిపోర్టులు రావాల్సి ఉన్నది. ఇప్పటి వరకు 6,24,840 మంది (ప్రతి పది లక్షలకు 16,830) నమూనాలను పరీక్షించగా 80,751 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో 57,586 మంది ఇప్పటికే కోలుకోగా 22,528 మంది చికిత్స పొందుతున్నారు. హౌం ఐసోలేషన్ లో ఉన్నవారిలో 84 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు.
1256 మందికి.....
తాజా పరీక్షల్లో 1256 మందిలో వైరస్ బయటపడింది. 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా వారి సంఖ్య 637కు చేరింది. జిల్లాలవారీగా కరోనా బాధితుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 389 మంది ఉండగా, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఒక్క కేసు కూడా లేదు. రంగారెడ్డిలో 86, సంగారెడ్డిలో 74, కరీంనగర్ 73, వరంగల్ అర్బన్ 67, ఆదిలాబాద్ 63, నల్లగొండ 58 ఉన్నాయి. అతి తక్కువగా ములుగు మూడు, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఆరు చొప్పున, భద్రాద్రి కొత్తగూడెం ఏడు, కామారెడ్డి ఎనిమిది, మెదక్లో తొమ్మిది ఉన్నాయి.