Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'అరిబండి' : తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణ బ్యూరో - బ్యూరో
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అనేక నిర్భంధాలకు ఎదురొడ్డి నిలిచిన వీరుడు అరిబండి లక్ష్మినారాయణ అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ అన్నారు. అరిబండి 22 వర్థంతిని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఏ ప్రభుత్వ సాయాన్ని పొందలేదన్నారు. ప్రజా సేవ చేసిన వారే చరిత్రలో నిలిచారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మూడ్ శోభన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అంజనేయులు, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.