Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ మొదటి తీర్పు విడుదల
నవతెలంగాణ-ముషీరాబాద్
అంబాల గ్రామ పంచాయతీ సర్పంచ్ను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ రద్దు చేసింది. ఈ విషయాన్ని ట్రిబ్యునల్ సభ్యులు పులిగారి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. బుధవారం ఎర్రమంజిల్ పంచాయతీరాజ్ కార్యాలయంలో మొట్టమొదటి తీర్పును విడుదల చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్ 4న వరంగల్ జిల్లా అంబాల గ్రామ సర్పంచ్ను ఆర్నెల్లు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. దీనిపై పంచాయతీరాజ్ ట్రిబ్యునల్లో అప్పీల్ చేయడంతో సభ్యులు సమగ్ర విచారణ జరిపారనీ, అభియోగాలన్నీ నిరాధారమైనవని రుజువుకావడంతో సస్పెండ్ను రద్దు చేసి సర్పంచ్కే తిరిగి విధులు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశామనీ చెప్పారు. ట్రిబ్యునల్ చైర్మెన్, సభ్యులు బండారు భాస్కర్, గటిక అజరుకుమార్లతో కలసి విచారణ చేపట్టి, గ్రామస్తులకు అర్థమయ్యే రీతిలో తెలుగులో తీర్పును విడుదల చేశామన్నారు. పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ సభ్యులుగా పదవీ బాధ్యత చేపట్టిన అనంతరం మొట్టమొదటి తీర్పు ఇదే విడుదల చేశామని ఆయన వివరించారు.