Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల కేంద్రాలు, మురికివాడల్లో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలి
- సహాయ చర్యల్లో పనిచేసేందుకు తమ కార్యకర్తలు సిద్ధం : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో విస్తృతంగా టెస్టులు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. మండల కేంద్రాలు, పట్టణాల్లోని మురికివాడల్లోనూ క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించింది. కరోనా కట్టడిలో భాగంగా ఎలాంటి సహాయక చర్యల్లో పాల్గొనేందుకైనా తమ పార్టీ శ్రేణులు సంసిద్ధంగా ఉన్నాయని ప్రకటించింది. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం హైదరాబాద్లోని ఎంబీ భవన్లో బుధవారం జరిగింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి వెంకట్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులుతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఇతర రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాల్గొన్నారు. సమావేశం కింది తీర్మానాలను ఆమోదించింది. 'గ్రామాలకు, పట్టణాల్లోని మురికివాడలకు కరోనా తీవ్రంగా విస్తరించింది. విస్తృతంగా టెస్టులు చేసి కరోనా నివారణా చర్యలు చేపట్టాలి. చిన్నగదులు, పూరి గుడిసెలు, అద్దె ఇల్లు, మురికివాడల్లో సొంత ఇండ్లయినప్పటికీ కరోనా బాధితులు హోం క్వారంటైన్లో ఉండేందుకు సరైన సౌకర్యాలు లేవు. దీనివల్ల కుటుంబ సభ్యులు మొత్తం కరోనా బారిన పడుతున్నారు. తక్షణం గ్రామాలు, మురికి వాడల్లో పరీక్షలు నిర్వహించాలి. ఇండ్లల్లో క్వారంటైన్ సౌకర్యాలు లేని వారికి ప్రభుత్వమే క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసి భోజన, తదితర వసతులన్నీ కల్పించాలి' అని ప్రభుత్వాన్ని కోరింది. 'కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా ఆధిపత్యం చెలాయించే ధోరణి కొనసాగిస్తున్నది. రాష్ట్రా నికి అదనపు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలి. కరోనా కట్టడిలో భాగంగా వైద్యసేవలకు అధిక నిధులు కేటాయించాలి' అని విజ్ఞప్తిచేసింది. 'హైదరా బాదు మహా నగరంతో పాటు, జిల్లా, మండల కేంద్రాల్లోని ప్రభుత్వాస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఈ నాలుగు నెలల్లో అభివృద్ధి చేసి కావాల్సిన డాక్టర్లు, నర్సులు, బెడ్లు, మెడికల్ సదుపాయాలు కల్పించి నట్టయితే రాష్ట్రంలో ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీ ఈ స్థాయిలో కొనసాగేది కాదు. అందుబాటులో ఉన్న ఆస్పత్రుల్లో కూడా కరోనా భయంతో సాధారణ వైద్యం అందడం లేదు. చివరకు గర్భిణీలకు పరీక్షలు నిరాకరిం చడంతో వారు పడుతున్న యాతన లపై హైకోర్టే రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలిం చింది. అయినా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదు. ఇప్పటికైనా మండల ఆరోగ్య కేం ద్రాల్లో, జిల్లా ఆస్పత్రుల్లో డాక్టర్లు, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీచేయాలి. మందులు, ఆక్సిజన్ వంటి సౌకర్యాలను కల్పించాలి' అని కోరింది.